PLD: సత్తెనపల్లిలోని నాగన్నకుంట, యానాది కాలనీల్లో పోలీసులు శనివారం భారీ స్థాయిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో 100 మంది సిబ్బంది ఇళ్లను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 34 వాహనాలను సీజ్ చేశారు. నేరాల నియంత్రణ, అ సాంఘిక కార్యకలాపాల నివారణే ధ్యేయంగా ఈ సోదాలు చేపట్టినట్లు డీఎస్పీ వివరించారు.