E.G: పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో సోమవారం నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ శిబిరంలో పాల్గొన్న పశువైద్య నిపుణులు పశువులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. పెద్ద సంఖ్యలో రైతులు ఈ శిబిరాన్ని వినియోగించుకొని తమ పశువులకు వైద్య సేవలు పొందారు.