VKB: తమ సమస్యలను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యుత్ కార్యాలయం ఎదుట సోమవారం కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేపట్టారు. సంఘం నాయకుడు మహేష్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి విధుల్లో కొనసాగుతున్న తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. పెండింగ్లోని సమస్యలను పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.