ELR: ముదినేపల్లి మండలం తూర్పుపాకల ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల తుఫాన్ కారణంగా వృక్షం పాఠశాల భవనంపై పడగా పాఠశాల శిథిలావస్థకు చేరింది. వెంటనే ఉపాధ్యాయులు ఎంపీపీ సత్యనారాయణకి తెలుపగా ఆయన వెంటనే స్పందించి పాఠశాలని సందర్శించారు. ఈ క్రమంలో తాత్కాలికంగా నిర్మించిన స్కూల్ భవనాన్ని ఇవాళ ప్రారంభించారు.