KKD: పిఠాపురం ప్రాంతాభివృద్ధి సంస్థ (పాడా) కార్యాలయంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు పాడా పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. బాధితులు ప్రత్యక్షంగానే కాకుండా ఆన్ లైన్ ద్వారా కూడా తమ ఫిర్యాదులను సమర్పించవచ్చని ఆయన సూచించారు.