TPT: నెల్లూరుకు విచ్చేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్కు బొకే అందజేసి స్వాగతం పలికారు. అనంతరం నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించారు. మాజీ ఎమ్మెల్యే వెంట నియోజకవర్గ వైసీపీ నేతలు పాల్గొన్నారు.