BPT: ప్రతి సోమవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని ఈ నెల 9న చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.