BPT: బాపట్లలో జరిగిన జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ ఉమామహేశ్వర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి స్మరించారు. సామాజిక అసమానతలను అధిగమించి దేశ సేవలో నిలిచిన ఆయన జీవితం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. కీలక పదవుల్లో పనిచేసి ఎన్నో మార్పులు తీసుకొచ్చారని చెప్పారు.