NTR: విజయవాడ భవానీపురంలో మిస్సైన ఇద్దరు చిన్నారుల కేసు సుఖాంతమైంది. ట్యూషన్కు వెళ్లకుండా ఇంట్లోని నగదు తీసుకుని పారిపోయిన మేరారామ్, ఉమారామ్, ఆచూకీ లభ్యమైంది. విజయవాడ నుంచి ముంబైకి వెళ్లిన చిన్నారులు, అక్కడి నుంచి గుజరాత్కు వెళ్తుండగా పోలీసులు చాకచక్యంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు క్షేమంగా దొరకడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.