NTR: నందిగామ మండలం పల్లగిరి గ్రామంలో శనివారం స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమం కింద “థీమ్ జీరో వేస్ట్” అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో ఆర్.వి.యస్. ప్రసాదరావు గ్రామ ప్రజలకు చెత్త సేకరణ, పరిశుభ్రత ప్రాముఖ్యత వివరించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అభివృద్ధి అధికారి, డిప్యూటీ ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.