గుంటూరులో మంగళవారం యాంటీ డ్రగ్స్ 2K వాక్ జరిగింది. యాంటీ డ్రగ్స్ ఫోరమ్ శంకర్ విలాస్ సెంటర్ నుంచి కొరిటెపాడు సెంటర్ వరకు ఈ వాక్ నిర్వహించింది. మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం, పోలీసులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా గంజాయి నిర్మూలన కోసం కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.