NDL: ఎరువుల దుర్వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో టాస్క్ ఫోర్స్ సమావేశంలో యూరియా పరిశ్రమల వైపు మళ్లకుండా నిఘా పెంచాలని సూచించారు. నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. అక్రమ రవాణా, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సునీల్ షొరాణ్ హెచ్చరించారు.