ATP: ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల మండల విద్యాశాఖ అధికారుల రెండు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. కొర్రపాడు, బుక్కరాయసముద్రం కేంద్రాల్లో నిర్వహించిన ఈ సదస్సులో కేపాసిటీ బిల్డింగ్, ఎఫ్ఎల్ఎన్ అంశాలపై అవగాహన కల్పించారు. అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల ఎంఈఓలు, డైట్ అధ్యాపకులు ఇందులో పాల్గొన్నారు.