ప్రకాశం: కంభంలోని కందులాపురం గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను బకాయిలు ఉండటంతో ఎంపీడీఓ వీరభద్రాచారి శుక్రవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎంపీడీఓ స్వయంగా పాల్గొని పన్ను వసూళ్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు IVRS కాల్స్ ద్వారా వచ్చే సమాచారం గురించి వివరించి, సమయానికి పన్నులు చెల్లించాలని అవగాహన కల్పించారు.