E.G: గోకవరం మండలంలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేసినట్లు కోరుకొండ సీఐ మూర్తి మంగళవానం తెలిపారు. ఎస్సై పవన్ కుమార్ నేతృత్వంలో తనిఖీలు నిర్వహించగా, రాజవొమ్మంగి మండలం పతంగి గ్రామానికి చెందిన కాపు స్వామి రెడ్డి పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి సుమారు ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.