అన్నమయ్య: నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో రూ. 40 లక్షలతో నిర్మించిన సచివాలయం-1 భవనం ఏడేళ్లు గడిచినా ప్రారంభానికి నోచుకోలేదు. చిన్నపాటి విద్యుత్ పనులు మినహా అన్నీ పూర్తయినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో అద్దె భవనాల్లో సేవలు నిర్వహిస్తూ ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.