మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసులు బుధవారం ఆకస్మిక దాడులు చేపట్టారు. లేఔట్లలో పేకాట ఆడుతున్న 5 మందిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ. 3400 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని, అలాంటి వారి గురించి సమాచారం ఇవ్వాలని ఎస్సై వేమన కోరారు.