GNTR: మంత్రి లోకేష్ కృషితో మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆత్మకూరులో కోకాకోలా సంస్థ సీఎస్ఆర్ నిధులు రూ.35 లక్షలతో పలు పనులు చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలు 52, 53, 54లను ఆధునీకరించి, 62వ కేంద్రానికి స్మార్ట్ టీవీ అందించారు. జెడ్పీ హైస్కూల్కు కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, క్రీడా దుస్తులు అందజేశారు.