SS: సోమందేపల్లి మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ యాదవ్ను యాంటీ కరప్షన్ ఫోరం సభ్యులు గురువారం సోమందేపల్లి పోలీస్ స్టేషన్లో సన్మానించారు. సత్యసాయి జిల్లా హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ ఫోరం అధ్యక్షులు నరసింహామూర్తి ఆధ్వర్యంలో సభ్యులు ఎస్సైను కలిసి శాలువా కప్పి, పూల బొకే అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాగభూషణ్ రెడ్డి పాల్గొన్నారు.