VSP: అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విశాఖలోని డాబాగార్డెన్స్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజానికి మార్గదర్శకులైన అంబేద్కర్ ఆలోచనలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్, వంశీ కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.