KDP: తమిళనాడుకి చెందిన అన్నామలై పలని స్వామి అనే వ్యక్తి 2017 సంవత్సరంలో సిద్ధవటం రేంజ్ నందు సిద్ధవటం బీట్లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. కేసు ఫైనల్ జడ్జిమెంట్ మంగళవారం తిరుపతి ఎర్రచందనం ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. అతనికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష రూ.6 లక్షలు జరిమానా విధించింనట్లు సిద్ధవటం రేంజ్ అధికారిణి కళావతి తెలిపారు.