VSP: సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నట్లు సింహా చలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి జరిగే కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలతో పాల్గొనాలని కోరారు. ఈ విషయాన్ని గమనించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.