VSP: వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు అధ్యక్షతన నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కురసాల కన్నబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకొని త్వరితగతిన వార్డు, సచివాలయ కమిటీలను పూర్తి చేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు .