KDP: కమలాపురంలో మత సామరస్యానికి నిదర్శనంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఉపసర్పంచ్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ హోమియోపతి డాక్టర్ షాకీర్ హుస్సేన్ చేతుల మీదుగా 200 పేద ముస్లిం కుటుంబాలు, మహిళలకు రైస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మతాలకు అతీతంగా పరస్పరం సహకరించుకోవడం సమైక్యతకు నిదర్శనమని స్థానికులు అభినందించారు.