మన్యం జిల్లా ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.