అన్నమయ్య: రంజాన్ మాసం సందర్భంగా రాయచోటిలో మాంసం ధరలు పెరిగాయి. చికెన్ కిలో ధర రూ. 210 నుంచి రూ. 240కి చేరగా, మటన్ ధర కిలోకు రూ. 800గా కొనసాగుతోంది. చేపల ధరలు రూ. 100 నుంచి 300 మధ్య ఉన్నాయి. ఆదివారం కావడంతో చికెన్ దుకాణాల వద్ద కొనుగోలుదారుల రద్దీ భారీగా కనిపించింది. ధరలు పెరిగినా వినియోగదారుల రద్దీ తగ్గలేదు. వ్యాపారులు డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు.