కోనసీమ: అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి గ్రామంలో బుధవారం రాత్రి అమలాపురం రూరల్ ఎస్సై శేఖర్ బాబు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్తులతో వివిధ సమస్యలపై చర్చించారు. సోషల్ మీడియా గ్రూపులను బాధ్యతాయుతంగా ఉపయోగించడం, మాదకద్రవ్యాలకు నిర్మూలన, మోటారు వాహన నియమాల ప్రాముఖ్యత, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి అవగాహన కల్పించారు.