KKD: పేదల భూములపై టీడీపీ నేతల కన్నుపడిందని తోట నరసింహం అన్నారు. జగ్గంపేటలో డ్రైవర్స్ కాలనీ స్ధలాల కబ్జాకు టీడీపీ నేతలు యత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2010లో అప్పటి మంత్రిగా ఉన్న తాను సర్వే నంబర్ 196/2లో సుమారు 200 పేద కుటుంబాలకు ఇళ్ళ పట్టాల పంపిణీ చేశానన్నారు. బాధితులతో కలిసి నరసింహం కలెక్టర్ షాన్ మోహన్కు ఫిర్యాదు చేశారు.