NDL: బేతంచర్ల మండలంలోని ఏం.పెండేకల్లులో అన్నదమ్ములపై నలుగురు దాడిచేసి గాయపరిచారని ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. గ్రామంలో ఇంటి పారు విషయంలో దాయాదుల మధ్య ఘర్షణ పడ్డారు. సయ్యద్ అబ్దుల్ రఫీ, అతని అన్న షఫీపై, శాలి ఫైల్మాన్ మరో ముగ్గురు దాడి చేశారని SI తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు నలుగురుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు SI వివరించారు.