PPM: సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై రూ. 12 కోట్లతో పునర్ నిర్మించిన హై లెవల్ బ్రిడ్జ్ను, అలాగే మక్కువ అజ్జాడ మధ్య NDB రోడ్డును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే విజయ్ చంద్రతో కలిసి ప్రారంభించారు. పార్వతీపురం నియోజకవర్గంలో రవాణా కష్టాలు తీరాయి. ఈ వంతెనతో దశాబ్దాల నిరీక్షణ ఫలించిందని, మన్యం ప్రాంత కనెక్టివిటీ మెరుగుపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.