TPT: పుత్తూరు, నారాయణవనంలో డాక్టర్ B. R. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని కొనియాడుతూ, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు.