GNTR: పొన్నూరులో ఈ నెల 14న అంబేద్కర్ జయంతిని ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ వీరానాయక్ కోరారు. ర్యాలీల్లో డీజేలు వాడటంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పరికరాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా వివాదాస్పద నినాదాలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వేడుకల్లో ట్రాఫిక్ మళ్లింపు దృష్ట్యా వాహనదారులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఆయన సూచించారు.