పల్నాడు: వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరుతూ ఆదివారం వెల్దుర్తి మండల ప్రజలు ఒకరోజు ఐక్య నిరాహార దీక్ష చేపట్టనున్నారు. జీవో నంబర్ 104 ప్రకారం ప్రాజెక్టుకు సంబంధించి 25 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని ప్రజలు ఎవరికి వారు వారి సొంత గృహంలోనే నిరాహార దీక్ష చేపట్టాలని వరికపూడిశెల జేఏసీ పిలుపునిచ్చింది.