ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మార్కాపురం జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం జరగనుందని ప్రకాశం జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షుడు నాయబ్ రసూల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లా నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ లింగరావు హాజరు అవుతారని తెలియజేశారు.