NDL: శ్రీశైలం ఘాట్ రోడ్డులోని శిఖరేశ్వరం సమీపంలో శుక్రవారం ఉదయం కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే 108 వాహనం నుంచి బాధితులను శ్రీశైలం ప్రాజెక్టు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.