AKP: కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద గురువారం అక్రమంగా తరలిస్తున్న పది మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా తుంపాల గ్రామానికి చెందిన కె. కాశీ విశ్వనాథం మద్యం బాటిల్స్ తీసుకువస్తుండగా పట్టుకున్నామన్నారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.