CTR: ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో జిల్లాలోని రిజిస్ట్రేషన్ శాఖకు సోమవారం రికార్డు స్థాయిలో ఆదాయం చేకూరింది. ఒక్కరోజే 1,458 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరగగా వాటి ద్వారా రూ.3.25 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు మరిన్ని రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.