SKLM: పోలాకి(మం) గంటపేట గ్రామంలో రామాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. బుధవారం గ్రామస్తుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు వైసీపీ నాయకులు ఉన్నారు.