జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో విశేషమైన ఆర్థిక పురోగతిని సాధించిందని డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున తెలిపారు. మంగళవారం డీసీసీబీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ 22 కోట్ల రూపాయల ప్రొవిజనల్ లాభాలను నమోదు చేసిందని, గత ఏడాది ఇది కేవలం 7 కోట్లకు మాత్రమే పరిమితమైందన్నారు.