KRNL: ఆదోనిలో ఓటర్ల జాబితా సవరణలో లోపాలున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి వీరేశ్ సోమవారం తెలిపారు. మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్కు వినతిపత్రం ఇచ్చారు. ఒకే కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు వార్డుల్లో ఉండటంతో ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. సరైన వార్డుల్లో పేర్లు నమోదు చేయాలని, లేకపోతే ఆందోళనలు చేస్తామని CPI నాయకులు హెచ్చరించారు.