W.G: చేనేత రంగాన్ని కాపాడుకోవడానికి, నేతన్నల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఈ నెల 22న మంగళగిరిలో నిర్వహించ తలపెట్టిన చేనేత గర్జనను విజయవంతం చేయాలని చేనేత సంఘాల నేతలు పిలుపునిచ్చారు. చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి నేతన్న సర్కిల్ వద్ద ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. దీనిలో భాగంగా శుక్రవారం నరసాపురం 25వ వార్డు వీవర్స్ కాలనీలో నేతలు పర్యటించారు.