CTR: ఇంటర్ ఫలితాల్లో పుంగనూరు అడవినాథునికుంట ఏపీ మోడల్ స్కూల్& జూనియర్ కళాశాల విద్యార్థిని క్యాతిప్రియ స్టేట్ ర్యాంక్ సాధించింది. ఇందులో భాగంగా గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో ప్రిన్సిపల్ రమాదేవి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. CEC విభాగంలో ముత్తుకూరుకు చెందిన క్యాతిప్రియ 491 మార్కులు సాధించినట్లు ఆమె తెలిపారు.