ప్రకాశం: త్రిపురాంతకం(మం) కేశినేనిపల్లి వద్ద అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. కేశినేనిపల్లి వద్ద తరచూ జరుగుతున్న ప్రమాదాలపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.