కోనసీమ: జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎం.రంగారావు ఎన్నికయ్యారు. అమలాపురంలో గురువారం జరిగిన జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో రంగారావుని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా వై.సాయి వెంకట రమణారావు, ఉపాధ్యక్షులుగా నరేంద్ర కుమార్, కార్యదర్శిగా రాయుడు సత్తిరాజు, సహాయ కార్యదర్శిగా టి.మమత బాధ్యతలు స్వీకరించారు.