కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతీ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. బుధవారం మండపేట పట్టణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండపేట లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన స్పౌస్ పింఛన్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.