ప్రకాశం: కొండపిలో సోమవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని పీ.ఎస్.సీ.ఎస్ ఛైర్మన్ రఘునాథ బాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేస్తుందని రఘునాథ బాబు అన్నారు. బయట మార్కెట్ కన్నా రూ.1000 అదనంగా పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.