PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలోని జీసీసీ గోడౌన్ వద్ద ఎల్పీజీ గ్యాస్ కోసం వినియోగదారులు భారీగా తరలివచ్చారు. గ్యాస్ సరఫరాకు సంబంధించిన నిబంధనలు, బుకింగ్ సమయంలో OTP సమస్యలు తలెత్తడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. పరిసర గ్రామాల ప్రజలు కూడా గ్యాస్ కోసం గోడౌన్ వద్దకు చేరుకోవడంతో రద్దీ పెరిగింది. గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు.