ప్రకాశం: సింగరాయకొండ నరసింహస్వామి దేవస్థానంలో ఇవాళ బహిరంగ వేలం పాటలు జరుగుతాయని ఈవో కృష్ణవేణి తెలిపారు. కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు, కొబ్బరి చిప్పులు, సప్లై సామాను, తలనీలాలు వేలంలో ఉంటాయని చెప్పారు. ఉదయం 10 గంటలకు కార్యాలయం వద్ద పాల్గొనవచ్చని వెల్లడించారు. ఇవాళ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారన్నారు.