ATP: జిల్లాలోని 64 కేంద్రాలలో మంగళవారం నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. జనరల్ విభాగంలో 20,588 మంది, ఒకేషనల్ విభాగంలో 1,872 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎం. వెంకటరమణ నాయక్ తెలిపారు. మొత్తం 359 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.