E.G: భారత రాజ్యాంగ రూపకర్త బీ.ఆర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా కడియం మండలం వేమగిరిలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ పూలమాల వేసి నివాళులుర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాధాన్యత వంటి విలువలను సమాజానికి అందించిన అంబేద్కర్ ఆలోచనలు తరతరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.